కొండాపూర్, సెప్టెంబర్ 1 : గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ కాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం… లింగంపల్లి రైల్ విహార్ కాలనీ 48వ క్వార్టర్లో బాదం మిల్క్ షేక్కు సంబంధించిన గోడౌన్ నిర్వహిస్తున్నారు.
బాదం మిల్క్ షేక్ పనుల్లో భాగంగా గోడౌన్లో వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ లీకైంది. ఇది గమనించని ఉద్యోగులు గురువారం ఉదయం లైట్ వేయగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో అంబలాల్ నాయక్ (21) మృతి చెందగా, రాహుల్ శర్మ, ప్రకాశ్ గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.