న్యూఢిల్లీ, అక్టోబర్ 25: లా నినా ప్రభావంతో ఈ శీతాకాలం చలి తీవ్రత అధికంగా ఉంటుందని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది. దాని ప్రకారం… జనవరి, ఫిబ్రవరిలో కొన్ని ఉత్తరాది రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే గత కొద్ది వారాలుగా భారత్లో వాతావరణ మార్పుల రూపంలో లా నినా ప్రభావం కనపడుతున్నది. అధిక వర్షపాతం, రుతుపవనాలు మళ్లిపోవడంలో ఆలస్యం వంటివి పసిఫిక్ జలాల్లో ఏర్పడుతున్న లా నినాకు సంబంధించినవే.