హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సముద్ర మట్టానికి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ అల్పపీడనం ప్రభావం కొనసాగుతుందని, ఇది రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతం మీదుగా మరింత బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి జైసల్మేర్, భోపాల్, గోండియా, జగదల్పూర్, కళింగపట్నం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతానికి వెళుతున్నదని తెలిపింది.
ఒక ద్రోణి దక్షిణ కొంకణ్ నుం చి ఉత్తర కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతంలోని సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని పేర్కొన్నది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో శనివారం వరకు హైదరాబాద్ సహా పలు జిల్లా ల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ మేరకు మొదటి రెండు ప్రమాద హెచ్చరికలు జారీచేసింది.
ఆ దిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలుపు తూ ఆరెంజ్ హెచ్చరిక జారీచేసింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదంటూ ఎల్లో హెచ్చరిక జారీచేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నదని తెలిపింది.
హైదరాబాద్లో గురువా రం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. ఏఎస్రావునగర్లో అత్యధికంగా 8.0 సెంటీమీటర్ల వర్షం పడింది. నేరేడ్మెట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, మచ్చబొల్లారం, కుషాయిగూడ, బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాతావరణ శాఖాధికారులు హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.