కామారెడ్డి: జిల్లాలోని ఐలాపూర్లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన మాధవి (17), రాజు (23) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారు పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి వివాహానికి పెద్దలు నిరాకరించరించారు. దీంతో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గుర్తించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. కాగా.. మాధవి చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.