బెంగళూరు : కర్ణాటకలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీప్ను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడగా.. ఇందులో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన చిక్కబల్లాపూర్ జిల్లా చింతామణి తాలూకా మరినాయకనహల్లి గ్రామ సమీపంలో.. చింతామణి – మదనపల్లి మార్గంలో జరిగింది. బాధితులను చింతామణి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
మృతులంతా కోలార్ జిల్లా శ్రీనివాసపూర్ తాలూకాకు చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలం వద్ద బాధితులకు ఎమ్మెల్యే నంజయ్ గౌడ్ సహాయం అందించారు. జీపు మరినాయకనహళ్లి సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై చింతామణి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.