హైదరాబాద్ : శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని ఓల్డ్ అల్వాల్లోని జొన్నబండ ఏరియా శివనగర్ ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో శివుడికి మహాకాల రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన రోజు అని, ఈ రోజు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించటం వల్ల భక్తులకు స్వామివారి అనుగ్రహం దక్కుతుందని ఆలయ చైర్మన్ కొడారి నర్సింగరావు, ప్రధాన అర్చకుడు విరివెంటి రాజశేఖర్ శర్మ తెలిపారు.