న్యూఢిల్లీ : 1980ల్లో రామాయణ టీవీ సీరియల్ ద్వారా ప్రేక్షకుల అభిమానం పొందిన నటుడు అరుణ్ గోవిల్ గురువారం బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా ఆయన కాషాయ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. ఉత్తర్ప్రదేశ్లోని మీరట్కు చెందిన గోవిల్ పలు సినిమాల్లో నటించడంతో పాటు స్వయంగా సినిమాలు, వివిధ భాషల్లో టీవీ షోలను రూపొందించారు.
రామాయణంలో రాముడి పాత్రతో 1987లో 29 ఏండ్లకే దేశవ్యాప్తంగా ప్రజల్లో విశేష ఆదరణ చూరగొన్నారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అరుణ్ గోవిల్ కాషాయ గూటికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.