హుజూరాబాద్ చౌరస్తా: సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటేయాలని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హుజూరా బాద్ మండలంలోని వెంకట్రావుపల్లి, రంగపూర్, సిర్సాపల్లి, సింగాపూర్, మందాడిపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు.
ఇక్కడ ఆయన మాట్లాడుతూ సంక్షేమం ఒకవైపు, గ్రామాల అభివృద్ధి మరోవైపు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరుసలో నిలబెట్టిన సీఎం కేసీఆరేనని చెప్పారు. గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాడన్నారు.
సైదాపూర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, లస్మన్నపల్లి సర్పంచ్ రాములు, చెల్మల్లా రాజేశ్వర్రెడ్డి, నాయకులు బత్తుల లక్ష్మీనారాయణ, పోలు ప్రవీణ్, రవీందర్, నరేశ్, భిక్షపతి, మహిపాల్, మధుకర్ పాల్గొన్నారు.