హైదరాబాద్, నమస్తే తెలంగాణ : ‘దేశ్కి నేత కేసీఆర్’ అంటూ యూకే లోని ఎన్నారైలు లండన్లో భారీ కేసీఆర్ కటౌట్ ను ఏర్పాటుచేశారు. ఆదివారం చరిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద సమావేశమైన ఎన్నారైలు.. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని కోరారు.
కేసీఆర్కు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలంతోపాటు పెద్దసంఖ్యలో ఎన్నారైలు పాల్గొన్నారు.