హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ)/చర్లపల్లి: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి వివిధ దేశాల్లోని ఎన్నారైలు మద్దతు ప్రకటిస్తున్నారు. లండన్లోని హైదరాబాద్ దర్బార్లో తెలంగాణ ఉద్యమకారుడు బాలమూరి సుమన్రావు ఆధ్వర్యంలో ఎన్నారైలు సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీతో ప్రజలు విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఏపీలో బీఆర్ఎస్ బ్యానర్లు
బీఆర్ఎస్కు మద్దతుగా ఏపీలోని పలుప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలుస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సెంటర్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ‘జై బోలో.. జై కేసీఆర్’ అంటూ రేవు అమ్మాజీరావు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆకర్షిస్తున్నాయి. విజయవాడలో కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతిస్తూ హోర్డింగ్లు ఏర్పాటుచేశారు.