లండన్ : లండన్లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్ బతుకమ్మ, దసరా ఉత్సవాలును ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా యూరోప్లోనే పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించి చరిత్ర సృష్టించారు. 1500 మందికి పైగా బతుకమ్మ ఆటలో పాల్గొని విజయవంతం చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో అరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన లండన్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారత దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటడం, కళలని ప్రోత్సహించడం పై నిర్వాహకులను అభినందించారు.
పూలనే దేవతగా పూజించి, ప్రకృతి పూజ చేయడంపై కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మరో అతిథి లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. భారతీయ సాంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ఎన్నారైల పైన ఉందన్నారు. 9 ఏండ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
మరో లండన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. వేల మంది మహిళలు ఒక్క చోట కలిసి పండుగ చేసుకోవడం చాలా అరుదు అన్నారు. బతుకమ్మలో తనని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక మేయర్ బిష్ణు, అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్, వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి గంగసాని ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ , రంగు వెంకట్, కార్యదర్శి మహేష్, జమ్మల వెంకట్ స్వామి , బాలకృష్ణా రెడ్డి , మహేష్ చాట్ల ,నరేంద్ర వర్మ , స్వామి ఆశ రాజు కొయ్యడ, ఆకుల శ్రీనివాస్ , వెంకట్ రెడ్డి , మీనా అంతటి , వాణి అనసూరి, శౌరి గౌడ్ , జయశ్రీ, సవిత జమ్మల, దివ్య, అమృత పాల్గొన్నారు.