ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు 30వేల వరకు చేరాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ఈ క్రమంలో వార్ధా జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకుంది. జిల్లా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా 60 గంటల పాటు లాక్డౌన్ విధించింది. శనివారం ఉదయం 8గంటల నుంచి 60 గంటల పాటు లాక్డౌన్ అమలులో ఉంటుందని కలెక్టర్ ప్రేర్నా పేట్రియాట్ పేర్కొన్నారు. ఈ సమయంలో అవసరమైన దుకాణాలు, మెడికల్ స్టోర్లు, పారిశ్రామిక ప్రాంతాలు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.2వేల జరిమానా విధించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గురువారం జిల్లాలో 251 మంది వైరస్ బారినపడగా.. నలుగురు మరణించారు. హోలీ పండుగను దృష్టిలో ఉంచుకొని వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో వైపు నాగ్పూర్లోనే కరోనా తీవ్రత కొనసాగుతోంది. జిల్లాల వరుసగా నాలుగో రోజు 500కుపైగా పాజిటివ్ కేసులు రికార్డవగా.. ఏడుగురు మరణించారు. ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు పూర్తి లాక్డౌన్ విధించగా.. తర్వాత కొంత సడలించారు.