చెన్నై: తమిళనాడులోని కూనూర్లో సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది భౌతికకాయాలను నీలగిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సూలూర్ ఎయిర్బేస్కు అంబులెన్స్లలో తరలించారు. ఈ సందర్భంగా స్థానిక తమిళ ప్రజలు రహదారుల పక్కగా బారులుతీరారు. బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది భౌతికకాయాలను తీసుకువెళ్తున్న అంబులెన్స్లపై స్థానికులు పూల జల్లు కురిపించారు. అనంతరం వారి మృతదేహాలను సూలూర్ ఎయిర్బేస్ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు.