బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్కు ఇకపై ఏటా రూ.కోటి రూపాయల అలవెన్స్ వస్తుందట. యూకే చట్టాల ప్రకారం దేశ ప్రధానిగా పనిచేసిన వాళ్లు మరణించే వరకు ఏటా ఆర్థిక సాయం అందుతూనే ఉంటుంది. అయితే ట్రస్ ఆ దేశ ప్రధానిగా పనిచేసిందేం లేదు. పన్నుల కోత హామీలతో ప్రధాని ఎన్నికల్లో నెగ్గిన ఆమె.. ఆర్థికంగా ఆలోచన లేని నిర్ణయాలు తీసుకొని అసలే కష్టాల్లో ఉన్న యూకే ఆర్థిక వ్యవస్థను మరింత గందరగోళ పరిస్థితుల్లో పడేశారు. దీనికి బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు.
దీంతో కేవలం 45 రోజులు మాత్రమే యూకే ప్రధానిగా పనిచేసిన ఆమె.. అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇంత తక్కువ సమయం ప్రధానిగా పనిచేసిన ఆమెకు ఇలా ఏటా రూ.కోటిపైగా చెల్లించడం సబబుకాదని కొందరు వాదిస్తున్నారు. ఆమెకు ఈ అలవెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్న కొందరు విశ్లేషకులు.. ప్రభుత్వం ఇచ్చినా ఆమె ఈ అలవెన్స్ నిరాకరిస్తే బాగుంటుందని, ప్రజల డబ్బు ఇలా వృధా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. 1991లో మార్గరెట్ థాచర్ రాజీనామా అనంతరం.. ప్రధాని అయిన జాన్ మేజర్ ఈ అలవెన్స్ విధానాన్ని తీసుకొచ్చారు.