ఏల్పుల పోచంది మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణం..లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్.. కళాయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను లైవ్ డ్రాయింగ్ వేశారు. సైకిల్కు త్రివర్ణ పతాకం పెట్టుకొని ఊరూరా తిరిగారు. అప్పుడు అక్కడి పరిస్థితులను గమనించారు. రైతులు, ప్రజల జీవనస్థితిగతులను తెలుసుకున్నారు. అన్నదాతల బాధలను దగ్గరుండి చూశారు. తెలంగాణ రైతులు ఎందుకు అదృష్టవంతులో పోచం చెప్పారు.. మరి పోచం ఏమంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.