హైదరాబాద్ : హోలీ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని వైన్షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ పాటించాల్సిందిగా తెలుపుతూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఇతరులకు అసౌకర్యం కలిగించడం, రోడ్లపై రంగులు చల్లడం, గుంపులుగా వాహనాలపై తిరగడం వంటి తదితర చర్యలను నిషేధిస్తూ మరో ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించారు. ఈ నియమాలను ఉల్లంఘించినైట్లెతే అటువంటి వ్యక్తులు విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.