న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదిక లింక్డ్ఇన్ తన ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. తమ సంస్థలో ఫుల్ టైం ఉద్యోగులుగా పని చేస్తున్న వారికి వారం రోజులు పెయిడ్ లీవ్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కష్ట పడి పని చేసిన తమ సిబ్బంది ఒత్తిడిని అధిగమించి, రిలాక్స్ అయ్యి, తిరిగి రెట్టించిన ఉత్సాహంతో రీఛార్జ్ అయ్యేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. వచ్చే సోమవారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానున్నది. దీనివల్ల సుమారు 16 వేల శాశ్వత ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డ్ఇన్.. రెస్టప్!.. అంటూ వారం రోజుల సెలవును తన ఉద్యోగులకు కల్పిస్తున్నది. దీనిపై లింక్డ్ఇన్ ఉద్యోగి తుయిలా హాన్సన్ మాట్లాడుతూ, సంస్థ కోసం కష్టపడి పనిచేసిన తమ ఉద్యోగులకు విలువైన సమయాన్ని కేటాయించాలనికుంటున్నాం. వారు మంచి సమయం గడపాలని భావిస్తున్నామని తెలిపారు.
సెలవు నుంచి తిరిగి వచ్చిన ఉద్యోగులందరూ పూర్తి శక్తితో పనిచేయాలని కోరుకుంటున్నామని లింక్డ్ ఇన్ ఉద్యోగులు చెప్పారు. అలాగే మెయిట్ టీం ఈ వారంలో పని చేస్తారు. ఆ తరువాత వారు కూడా ఈ సెలవును తీసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులు సేద తీరతారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు లింక్డ్ఇన్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానం వర్తిస్తుంది. అంతేకాదు సగంమంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రామాణికంగా మార్చాలని కూడా యోచిస్తున్నది. కాగా మైక్రోసాఫ్ట్ 2016 మధ్యలో లింక్డ్ఇన్ను 26.2 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్ఖాన్
లైవ్లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
రంగ్ దే 8 డేస్ కలెక్షన్స్ .. లక్ష్యానికి చాలా దూరంలో నితిన్