హైదరాబాద్: బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా ఈ నెల 22 నాటికి వాయుగుండంగా బలపడి తుఫాన్గా మారనున్నదని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. వర్షాలకు తోడు చలి కూడా క్రమంగా పెరుగుతుండటంతో రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపింది.