హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రపదేశ్ తీరం నుంచి ఉన్న తూర్పు, పశ్చిమ ద్రోణి శనివారం బలహీన పడిందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నదని చెప్పింది.
రాగల 24 గంటల్లో ఈశాన్యంతోపాటు పరిసరాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.