LIC for Digital Transmission | త్వరలో ఐపీవోకు వెళ్లనున్న కేంద్ర ప్రభుత్వ బీమా రంగ సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ సంస్థ సేవలను పూర్తిగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం కన్సల్టెన్సీ సర్వీస్ అందించే సంస్థల కోసం బిడ్లను ఆహ్వానించింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో కరంట్ ట్రెండ్కు అనుగుణంగా ఐటీ సేవలందించడంలో ఉత్తమ పద్దతులు అవలంభిస్తున్న సంస్థలను ఆహ్వానించింది.
జాతీయంగా, అంతర్జాతీయంగా తమ బిజినెస్ లావాదేవీలను డిజిటల్ పరివర్తనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించగల సామర్థ్యం గల మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటర్జీ కన్సల్టెంట్స్ నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ)లను ఆహ్వానించింది. సంస్థాగత వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో తన బిజినెస్ వ్యూహానికి అనుగుణంగా ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకున్నది. బిడ్లు దాఖలు చేయడానికి వచ్చేనెల 17వ తేదీ తుది గడువు అని తెలిపింది.