తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 15న చక్రస్నానం కారణంగా ఆలయంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో 14న వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. వీఐపీలు, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. ఇప్పటికే బ్రహ్మోత్సవాలకు గురువారం (7న) ధ్వజారోహణం జరుగనున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం నిలిపివేసింది.