జగిత్యాల : ఎంతో మంది మహనీయుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం లభించిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్రీటీష్ పాలనను అంతమెందించేందుకు ఎందరో వీరులు తమ ప్రాణాలను బలిపెట్టారన్నారు. వీరుల త్యాగఫలితంతో ఏర్పడిన స్వాతంత్య్ర స్ఫూర్తిని భావితరాలకు అందజేయాలన్నారు. అనంతరం వివిధ వేషధారణలో ఉన్న చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, జెడ్పీటీసీ బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టి బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ చైర్మన్ సునిల్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.