జమ్మికుంట చౌరస్తా : జమ్మికుంట ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిర్మించిన ఫ్లైఓవర్ సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హామీ ఇచ్చారు. గురువారం హరీశ్రావు మడిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారా న్ని ముగించుకుని తిరిగి జమ్మికుంట వైపు వస్తుండగా స్థానిక పిట్టల వాడకు చెందిన సుమారు 100 మహిళలు తన కోసం ఎదురు చూస్తుండడాన్ని గమనించిన మంత్రి తన కాన్వాయ్ను ఆపి సదరు మహిళలతో కాసేపు ముచ్చటించారు.
జమ్మికుంట రైల్వే వంతెన వల్ల తాము తీవ్రంగా నష్ట పోయామని, ఇప్పుడు మేం రైల్వే గేటు దాటాలంటే సుమారు రెండు కిలోమీటర్లు తిరగాల్సి వస్తుందని ఎలిపారు. తమ పిల్లల చదువులు ఆగిపోయాయని మంత్రికి వివరించారు. దీంతో ఈ బ్రిడ్జి సమస్య నుంచి మీకు విముక్తి కల్పిస్తామని హమీ ఇచ్చారు. మంత్రి వెంట మన్సిపల్ చైర్మన్ తక్కళ్ల పెల్లి రాజేశ్వర్ రావు, మాజీ చైర్మన్ పొడేటి రామస్వామిలు ఉన్నారు.