ముంబై: మహారాష్ట్రలోని సతారాలో విచిత్రం చోటుకున్నది. సతారాలోని కోయానగర్లోని ఓ ఇంట్లోకి చిరుతపులి చొరబడింది. ఇంట్లోని గదుల్లో దర్జాగా తిరిగింది. కోయానగర్కు చెందిన ఓ కుటుంబం గురువారం రాత్రి దుర్గా విగ్రహాల నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోకి ఓ చిరుతపులి చొరబడింది. నిమజ్జనం అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు.. ఓ గది తలపు వద్ద కూర్చొని ఉన్న పులిని చూసి షాక్ అయ్యారు. వెంటనే భయంతో బయటకు పరుగులు తీసిన కుటుంబ సభ్యులు.. తలుపులను మూసి గడియపెట్టారు.
ఇంట్లోకి చిరుతపులి వచ్చిందన్న సమాచారంతో చుట్టుపక్కలవారు పెద్దఎత్తున అక్కడ గుమిగూడారు. కిటికీల్లోనుంచి చిరుతపులిని వీడియోలు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. పులిని బోనులో బంధించి తీసుకెళ్లారు.