కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలంలో చిరుత మృతి చెందింది. మండలంలోని దుగ్గి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం చిరుతపులిని ఢీకొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కళేబరాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. చిరుత వయసు ఏడాది నుంచి ఏడాదిన్నర ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.