అమరావతి : కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి సమీపంలో చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదోని- ఎమ్మెగనూరు ప్రధాన రహదారి పక్కన పొలాల్లో చిరుత కళేబరాన్ని గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని పరిశీలించి గ్రామస్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిరుత వయస్సు 5 నుంచి 6 సంవత్సరాలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. అనంతరం చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకొని ఆదోనిలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. పశువైద్యాధికారితో శవపరీక్ష నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అటవీ శాఖ రేంజ్ అధికారిణి స్ఫూర్తి తెలిపారు.