మన్సూరాబాద్ : ఎస్ఎస్ రోలర్ ఇన్లైన్ హాక్ క్లబ్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, కోచ్లు శ్రీనివాస్యాదవ్, యాదయ్య ఆధ్వర్యంలో స్కేటింగ్ క్లబ్ క్రీడాకారులు ఆదివారం ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని కలిశారు. ఈనెల 31 నుంచి ఏప్రిల్ 10 వరకు చండీఘడ్లో నిర్వహించనున్న నేషనల్ ఇన్లైన్ హాకీ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించి పూలమొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు క్రీడాకారులకు ఆర్థికంగా చేయూతనిస్తుందని తెలిపారు. ఎల్బీనగర్లో ఇన్లైన్ హాకీ గ్రాండ్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు టి.మోక్ష, యశ్విత, రిషిక, టి.నందిత, వైష్ణవి, స్ఫూర్తిక, భవ్య, వర్షిత, సుశ్రిత, కీర్తి, ప్రణవి, తదితరులు పాల్గొన్నారు.
బీఎన్రెడ్డినగర్ డివిజన్ వైదేహినగర్ పోస్టాఫీస్ తరలింపును విరమించుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానికులతో కలిసి ఛీప్ పోస్ట్ మస్టార్ జనరల్ రాజేంద్రకుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైదేహినగర్ పోస్టాఫీస్ను వనస్థలిపురంలో విలీనం చేస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. నష్టాల్లో నడుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నట్లు తెలిపారు. కానీ చుట్టు పక్కల ఉన్న 150 కాలనీలకు సౌకర్యవంతంగా ఉండే దీనిని తరలిస్తే స్థానికులకు సమస్యగా మారుతుందన్నారు.
వందలాదిగా పోస్టల్ అకౌంట్లు ఉన్నాయని, అందులో సీనియర్ సిటిజన్లు అధికంగా ఉన్నారన్నారు. మార్పు వలన వారు ఇబ్బందులకు గురవుతారని, వీలీనం కాకుండా మరో ప్రత్యామ్నయాన్ని చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైదేహినగర్ ప్రధాన కార్యదర్శి పోగుల రాంబాబు, పెన్షన్ దారుల కన్వీనర్ నందిరాజు లక్ష్మినారాయణ, ప్రకాశ్బాబు, కృష్ణప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.