న్యూఢిల్లీ : భారత్లో అక్టోబర్ 14న రెడ్మి ఏ1+ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈనెల 14న భారత్లో రెడ్మి ఏ1+ లాంఛ్ అవుతుందని చైనా స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ ట్విట్టర్ పోస్ట్లో వెల్లడించింది. అప్కమింగ్ బడ్జెట్ రెడ్మి ఫోన్ స్పెసిఫికేషన్స్ను కూడా కంపెనీ తెలిపింది. రెడ్మి లేటెస్ట్ స్మార్ట్ఫోన్ టెక్స్చర్ ఫినిష్ డిజైన్తో బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్స్లో కస్టమర్ల ముందుకు రానుందని మైక్రో సైట్ పేర్కొంది.
రెడ్మి ఏ1+ వాటర్డ్రాప్ నాచ్ డిస్ప్లేను కలిగిఉంటుందని, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో అండ్రాయిడ్ 12 సపోర్ట్తో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్తో రానుందని తెలిపింది. ఇటీవల లాంఛ్ అయిన రెడ్మి ఏ1కు అప్గ్రేడెడ్ వెర్షన్గా రెడ్మి ఏ1+ ఎంట్రీ ఇస్తోంది. రెడ్మి ఏ1 ధర రూ 6499 కాగా రెడ్మి ఏ1+ ధర కొద్దిగా అధికంగా ఉండనుంది.
అధికారికంగా రెడ్మి ఏ1+ ధర వివరాలు వెల్లడించకున్నా రూ 10,000 లోపు ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక రెడ్మి ఏ1+ 6.52 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మిడియాటెక్ హెలియో ఏ22 చిప్సెట్తో ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్పై ఈ స్మార్ట్ఫోన్ రన్ అవుతుంది.