టోక్యో: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల ఖర్చుకన్నా జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల ఖర్చు ఎక్కువ కానున్నదని ఓ మీడియా నివేదిక వెల్లడించింది. ఈ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించడం అనవాయితీ.
అయితే ఎలిజబెత్ అంత్యక్రియలకు ఎంత ఖర్చు చేశారన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ.. దాదాపు రూ.74 కోట్లు ఖర్చు కావొచ్చని మీడియా అంచనా వేసింది. అలాగే షింజో అబే అంత్యక్రియలకు రూ.95 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ అంత్యక్రియలు వచ్చే వారం జరుగనున్నాయి.