ముంబై: భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో రాయగఢ్ జిల్లా మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద సుమారు 30 మందికిపైగా చిక్కుకున్నట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించామని రాయ్గఢ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా నీటమునగడంతో ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరినట్లు రాయ్గఢ్ ఇన్చార్జి మంత్రి అతిథి తట్కారే తెలిపారు. కొండచరియల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఆర్మీ, నేవీ బృందాలను పంపించాలని కోరినట్లు చెప్పారు. వరదల వల్ల రోడ్లు కొట్టుకుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.
కాగా, గురువారం రాత్రి భారీ వర్షాలు కురియడంతో ఛిఖ్లీ గ్రామం పూర్తిగా నిటమునింది. దీంతో అధికారులు గ్రామస్తులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పుణేలోని భీమ్శంకర్లోని భీమశంకర్ ఆలయం పూర్తిగా నీటమునింది. భారీ వర్షాల కారణంగా ఆలయంలో నుంచి వరద ప్రవహిస్తున్నది. మరోవైపు, కేరళలోని ఎర్నాకుళం, ఇడుక్కి, వయనాడ్లో శుక్రవారం అతి భారీ వర్షాలు కురవొచ్చని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.