న్యూఢిల్లీ: బీజేపీ ముందు తల వంచనందుకే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు వేధింపులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. పశుదానా కుంభకోణానికి సంబంధించిన మరో కేసుపై విచారణ జరిపిన సీబీఐ రాంచీ ప్రత్యేక కోర్టు లాలూను దోషిగా పేర్కొంది. మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ బీజేపీపై మండిపడ్డారు. ‘బీజేపీ బ్రాండ్ రాజకీయాల ముందు తలవంచని వారికి ఇలాంటి వేధింపులే ఎదురవుతాయి’ అని ట్విట్టర్లో విమర్శించారు.
‘బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ రాజకీయాలకు లొంగలేదు. అందుకే ఈ వేధింపులు. ఆయనకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను’ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. లాలూకు ఈ మేరకు మద్దతు ఇచ్చారు.
కాగా, బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ జతకట్టాయి. మరికొన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమిలో ఈ రెండు పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి.
भाजपा की राजनीति का ये अहम पहलू है कि जो भी उनके सामने झुकता नहीं है, उसको हर तरह से प्रताड़ित किया जाता है।
लालू प्रसाद यादव जी पर इसी राजनीति के चलते हमला किया जा रहा है। मुझे आशा है कि उन्हें न्याय जरूर मिलेगा।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 18, 2022