యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం శ్రీ మహావిష్ణు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యారాధనల అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై బాలాలయంలో ఉరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. స్వామివారిని సమాచార శాఖ ముఖ్యకమిషనర్ బుద్ధ మురళీ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి, శేషవస్త్రంతో సత్కరించారు.