బాలానగర్, ఆగస్టు 26 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదోతరగతి ఫలితాలలో జీపీఏ10 సాధిస్తే ఉచితంగా ట్యాబ్లు అందజేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించారు. శుక్రవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని 3 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డితో కలిసి ఆయన కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారు సహపంక్తి భోజనం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గంలో 11 వేలమంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా కిట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 9వేలకు పైగా విద్యార్థులకు కిట్లు అందజేసినట్లు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధించి సత్తా చాటాలని సూచించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు, నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, నాయకులు మందడి సుధాకర్రెడ్డి, ఎడ్ల మోహన్రెడ్డి, పంజా రాంచందర్, అంబటి సునీల్కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, ప్రేంకుమార్, నాగేందర్గౌడ్, బీఎన్ స్వామితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.