హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా బయటకు వచ్చి ఓటు వేసిన జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ ధన్యవాదాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. నెల రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.