హైదరాబాద్ : ఆడుకుంటూ వెళ్లిన బాలుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఏ.ఎస్.రావు నగర్ ఈస్ట్ మారుతి నగర్లో బాలుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రగాయాలపాలైన బాలుడు నిశాంత్(8) నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తండ్రి రెండేళ్లక్రితమై చనిపోయాడు. ఒంటిరి తల్లి కొడుకును బ్రతికించుకునేందుకు పోరాడుతుంది. మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్ సోహైల్ అనే వ్యక్తి బాలుడి స్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేసి ఆదుకోవాల్సిందిగా కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి తన ఆఫీసు సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.