హైదరాబాద్: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగయ్య మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాగయ్య ‘వేదం’ సినిమాలో సిరిసిల్ల రాములు పాత్రతో లక్షలాది మందిని కదిలించారని కొనియాడారు. ఆ తర్వాతి కాలంలో ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్వయంగా కలిశానని, ఆ సందర్భంలో ఆయనతో జరిగిన ఆత్మీయ సంభాషణను మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. నాగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు.
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగయ్య ఈరోజు తుది శ్వాస విడిచారు. నాగయ్య మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.