హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల చేసిన ట్వీట్పై ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో స్పందించారు. ‘కేటీఆర్ జీ గోషామహల్ నియోజకవర్గం, ఓల్డ్సిటీ అంతటా నా బుల్లెట్తో రైడ్ చేద్దాం. జరిగిన అభివృద్ధి తొలి అనుభవం మీకు వస్తుంది. ఏమంటారు?’ అంటూ రాజాసింగ్ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేశారు. దీనిపై శనివారం కేటీఆర్ స్పందించారు. ‘మీరు పెట్రోల్బంక్కు వెళ్లి పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోండి. అలాగే ఇండ్ల ముందు ఆగి ఎల్పీజీ సిలిండర్ ధరలు ఎలా పెరుగుతున్నాయో విచారించండి. జీడీపీ హైక్ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని వినబడుతుంది. ‘జుమ్లా బంద్ కరో.. కామ్ కర్కే దిల్ జీతో.. ’ అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.