యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ పాన్ ఇండియా సినిమాగా ఆదిపురుష్ను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, కృతి సనన్ కథానాయిక, రావణుడుగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తారని ఇప్పటికే అఫీషియల్గా ప్రకటించారు.
ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్తో పాటు ఇతర పాత్ర ధారులు కూడా చాలా కష్టపడుతున్నారు. కృతిసనన్ అయితే ఏకంగా తెలుగు నేర్చుకునేందుకు సిద్దమైందట. ఓ తెలుగు ట్యూటర్ను నియమించుకొని డైలాగ్స్ తెలుగులో ఎలా చెప్పాలో నేర్చుకుంటుందట. ఆదిపురుష్ పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ తెలుగు మూలం కాబట్టి కృతి ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. నాగ చైతన్యతో ‘దోచేయ్, మహేష్తో వన్ నేనొక్కడినే సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రభాస్ సరసన నటిస్తుంది. ఈ సినిమా అయిన కృతికి కలిసొస్తుందా చూడాలి.