హైదరాబాద్ : కృష్ణ కమలం. దీన్నే కౌరవపాండవ పుష్పం అంటారు. మహాభారతానికి సింబల్గా దీన్ని పోల్చుతారు. ఎలాగంటే? చూట్టు ఉన్న సన్నని తీగలను కౌరవులుగా,పైన ఐదు రెక్కలను పంచ పాండవులుగా వాటిపై కొలువైన మూడు రేకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లుగా అభివర్ణిస్తారు. మధ్యలో సుదర్శన చక్రాన్ని కూడా చూడొచ్చు. ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే మూడేళ్లకోసారి మాత్రమే ఇది పుష్పిస్తుంది. ఇలా వికసించిన కృష్ణ కమలాన్ని యూఎన్ మాజీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ఎం పూరి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని కౌసౌలి పట్టణంలో వికసించిన ఈ కృష్ణ కమలాన్ని ఆమె షేర్ చేశారు. ఒక పువ్వు అద్భుతాన్ని స్పష్టంగా చూడగలిగితే మన జీవితమే మారిపోతుందన్న బుద్ధుడి స్తూకిని ఆమె క్యాప్షన్గా జోడించారు.