హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల నుండి చికిత్సల నిమిత్తం అంబులెన్స్, వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలలో తెలంగాణకు వచ్చే కొవిడ్ రోగులకు సంబంధిత ఆసుపత్రులు జారీ చేసిన లెటర్స్తో పాటు హైదరాబాద్లోని వైద్య ఆరోగ్య & ప్రజారోగ్య కొవిడ్ కంట్రోల్ రూమ్ జారీ చేసిన పాస్ విధిగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సంబంధిత ఆసుపత్రి ఇచ్చే లెటర్తో పాటు విధిగా కొవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా జారీ చేయబడే పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి వచ్చే కొవిడ్ రోగులు ఈ అంశాన్ని గమనించి తమతో సహకరించాలన్నారు. పాసులు లేకుండా వచ్చి సరిహద్దులలో ఇబ్బందులు పడవద్దని సూచించారు.
సాదారణ వాహనాలకు ఈ పాస్ తప్పనిసరి..
అదే విధంగా ఇతర ప్రాంతాల నుండి తెలంగాణలోకి వచ్చే సాధారణ వాహనదారులు, వ్యక్తిగత, ప్రైవేట్ వాహనాలలో వచ్చే ప్రయాణికులంతా విధిగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్ విధిగా పొంది ఉండాలన్నారు. ఈ పాస్ లేని వారిని సైతం తెలంగాణలోకి అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.