మనీలా: ఫిలిప్పీన్స్లో భారీ ప్రమాదం తప్పింది. కొరియన్ ఎయిర్లైన్స్కు (Korean Air lines) చెందిన విమానం ల్యాండ్ అవుతుండగా రన్వే పైనుంచి దూసుకెళ్లింది. దీంతో విమానం ముందుభాగం ధ్వంసమయింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కొరియన్ ఎయిర్లైన్స్కు చెందిన కేఈ631 ఎయిర్బస్ విమానం 173 మందితో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం నుంచి ఫిలిప్పీన్స్ వెళ్తున్నది. ఈ క్రమంలో ఫిలిప్పీన్స్లోని సెబూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
అయితే ప్రతికూల వాతావరణం వల్ల రన్వై పైనుంచి దూసుకెళ్లింది. దీంతో విమానం ముందుభాగం ధ్వంసమయింది. అయితే విమానంలోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. ప్రమాదం కారణంగా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశామని తెలిపారు.