న్యూ ఢిల్లీ : న్యూ ఢిల్లీ తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడతుఊ.. తెలంగాణ సమాజానికి బాపూజీ చేసిన సేవలు మరువలేనివన్నారు. తొలి, మలిదశ తెలంగాణ పోరాటంలో ఆయన పాల్గొన్నారని గుర్తు చేశారు. తన జీవిత కాలమంతా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన గొప్ప నాయకుడు బాపూజీ అన్నారు.