నల్లగొండ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవిత కాలమంతా ప్రజల కోసమే పరిత పించిన గొప్ప నాయకుడు అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ విశేషంగా కృషి చేశారన్నారు. తొలి,మలి దశ తెలంగాణ పోరాటంలో ఆయన పోరాట పటిమ మరువలేనివన్నారు.
ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, జడ్పీ వైస్ చైర్మన్ పెద్దులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.