ముప్కాల్: ముప్కాల్ మండలంలోని నల్లూర్ గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య వీరుడు కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఎంపీపీ సామ పద్మ, జెడ్పీటీసీ బద్దం నర్సవ్వ, ప్రజాప్రతినిధులు బండారి బోజన్న, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్, ప్రజాప్రతినిధుల సంఘం ప్రధాన కార్యదర్శి దేగాం గంగాసాయన్న, విగ్రహదాత స్థానిక సర్పంచ్ జక్క సుగుణ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆదిలాబాద్ సంఘం జిల్లా అధ్యక్షుడు సాట్ల అశోక్ మాట్లడుతూ ఆదివాసులు రాష్ట్రంలో రాజకీయంగా ముందుకు వెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో 4 లక్షల జనాభా ఉన్న ఆదివాసులకు చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. అన్నిరంగాల్లో ఆదివాసులు అభివృద్ధి చేందాలని సూచించారు. అనంతరం వేదికను అలంకరించిన ఆదివాసి ప్రజా ప్రతినిధులను శాలువాలతో సన్మనించారు.
విగ్రహ దాత సర్పంచ్ జక్క సుగుణ నారాయణ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గడ్డం శంకర్, రాంచందర్, అశోక్, పెద్ది రమణ, మీనుగు రాజేశ్వర్, పెద్ది రమణ, గ్రామ ఉప సర్పంచ్ స్రవంతి, ఎంపీటీసీ సత్యనారాయణ, కొత్తపల్లి సర్పంచ్ మారెళ్లి విష్ణు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సామ వెంకట్ రెడ్డి, బద్దం నర్సారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.