పుణె: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండవ వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లు హాఫ్ సెంచరీలు చేశారు. అయితే కోహ్లీ 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. కేఎల్ రాహుల్ వరుసగా రెండవ అర్థ సెంచరీ నమోదు చేశాడు. 33 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన ఇండియా 164 రన్స్ చేసింది. రాహుల్ 66 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు. రషీద్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔటయ్యాడు.