అమరావతి : కేంద్ర మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశంపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా స్టార్డమ్గా ఎదిగిన ఎన్టీఆర్ సేవలను దేశవ్యాప్తంగా ఉపయోగించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
నిన్న హైదరాబాద్లో సమావేశమైన అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ కలయికపై మీడియా అడిగిన ప్రశ్నలకు కొడాలి నాని స్పందించారు. ప్రధాని మోదీ గాని, కేంద్ర మంత్రి అమిత్ షా గాని ఎదుటి వ్యక్తితో పనిలేనిదే ఒక్క క్షణమైన మాట్లాడరని ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాల్లో అభిమానులున్న ఎన్టీఆర్తో బీజేపీతో బలోపేతం చేసేందుకే సమావేశమైన ఉండవచ్చని అన్నారు. చంద్రబాబును బీజేపీ నమ్మే పరిస్థితుల్లో లేక ఎన్టీఆర్ సేవలను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశాల కోసం కలిసి ఉంటారని తాన భావిస్తున్నానని తెలిపారు.
అమిత్ షా, నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. వీరిద్దరి సమావేశం రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే వీరిద్దమరి మధ్య కొనసాగిందని స్పష్టం చేశారు.