మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 4: మహబూబ్నగర్లోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఖరీదైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్టు దవాఖాన సూపరింటెండెంట్, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ రాంకిషన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మర్లుకు చెందిన 70 ఏండ్ల చిన్నారెడ్డి, ఏనుగొండకు చెందిన 63 ఏండ్ల సరోజ మోకీళ్ల నొప్పులతో బాధపడుతుండగా, వారికి గత నెల 24న శస్త్రచికిత్స చేసి మంగళవారం డిశ్చార్జి చేసినట్టు చెప్పారు. మోకీలు మార్పిడికి ప్రైవేట్లో రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు.