టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతాకు ఉమేష్ యాదవ్ మరోసారి అద్భుతమైన ఆరంభం అందించాడు. ఫామ్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1)ను పెవిలియన్ చేర్చాడు. తొలి బంతి నుంచే మయాంక్ను ఇబ్బంది పెట్టిన ఉమేష్.. మొదటి ఓవర్ చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా అతన్ని అవుట్ చేశాడు.
ఫుల్ లెంగ్త్లో అతను వేసిన బంతిని లెగ్సైడ్ ఆడేందుకు మయాంక్ ప్రయత్నించాడు. కానీ సరిగా అంచనా వేయలేకపోవడంతో ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో పంజాబ్ జట్టు తొలి ఓవర్ ముగిసే సరికి 2/1 స్కోరుతో నిలిచింది.