ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలనను తిరిగి నెలకొల్పిన మయన్మార్లో ప్రజాఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్త్తున్న విషయం తెలిసిందే. నిరసనకారులపై మిలిటరీ ఉక్కుపాదం మోపుతూ ఇప్పటికే దాదాపు 60 మందిని పొట్టునబెట్టుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం కచిన్ రాష్ట్రంలోని మిట్కినాలో.. నిరసనకారులను అణిచివేయవద్దంటూ సైనికులను ఒక క్రైస్తవ సన్యాసిని (నన్) మోకాళ్లపై నిలబడి వేడుకున్నారు. ఈ దృశ్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నది.