న్యూఢిల్లీ: వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ కుటుంబంలో విషాదం నెలకొంది. తన తండ్రి చనిపోయారని పొలార్డ్ సోషల్మీడియాలో బుధవారం వెల్లడించాడు. మీరు అక్కడ బాగున్నారని నాకు తెలుసు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న కొన్ని ఫొటోలను పొలార్డ్ షేర్ చేశాడు. ముంబై ఇండియన్స్ జెర్సీలో ఐపీఎల్ 2019 విన్నర్స్ ట్రోఫీతో ఉండగా తీసిన ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.
‘ప్రశాంతంగా విశ్రమించండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా. ఎన్నో హృదయాలను మీరు గెలుచుకున్నారు. ఇక ముందు కూడా మిమ్మల్ని గర్వపడేలా చేస్తూనే ఉంటా. టాల్ బాయ్ ఇకలేరు. మీరు ఏదో ఒకచోట విశ్రాంతి తీసుకుంటారని నాకు తెలుసు’ అంటూ పొలార్డ్ భావోద్వేగ పోస్ట్ చేశాడు.
పొలార్డ్ తండ్రి మరణం పట్ల చాలా మంది క్రికెటర్లు ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. సచిన్ టెండుల్కర్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు పొలార్డ్కు సానుభూతి ప్రకటించారు.
కోహ్లీ ముందుకు..రాహుల్ వెనక్కి
ఆటగాళ్లకు గాయాలు..ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఆందోళన!
కోహ్లీ వరల్డ్ రికార్డు..పాంటింగ్, సచిన్లను వెనక్కి నెట్టి!
ఇంగ్లాండ్కు షాక్..కెప్టెన్ మోర్గాన్ రెండో వన్డేకు దూరం!
పెళ్లి చేసుకుంటున్న స్టార్ స్పిన్నర్.. ఐపీఎల్ తొలి మ్యాచ్కు దూరం